Thursday, April 25, 2024
- Advertisement -

ఓటు అమ్ముకోవ‌డంపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన మంచు మ‌నోజ్‌…

- Advertisement -

ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ శాతం పెంచ‌డానికి ఓట‌ర్ల‌లో చైత‌న్యం తీసుకు రావ‌డానికి సినీ న‌టులు ట్వీట్‌లు చేస్తుంటారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై యాక్టివ్‌గా ఉండే టాలీవుడ్ హీరో మంచు మ‌నోజ్ తాజాగా ఓట‌ర్ల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోక‌పోతె నేర‌మ‌న్న మ‌నోజ్‌…ఓట్లు అమ్ముకోవ‌డంపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోహ‌న్‌బాబు పుట్టిన రోజు సంద‌ర్భంగా తిరుప‌తిలోని శ్రీవిద్యానికేత‌న్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

గేదె ఖరీదు రూ.80 వేలు. ఎద్దు ఖరీదు రూ.50 వేలు. మేక ధర రూ.10 వేలు. పంది ధర రూ.3 వేల నుంచి రూ.5 వేలు. ఓటుకి రూ.500 నుంచి రూ.5 వేలు ఇస్తున్నారన్నా మనమేంటి? మనం పందులకంటే హీన‌మా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల్లో బ‌లిసినోళ్లు డ‌బ్బులిస్తే తీసుకోండి కాని అమ్ముడు పోకండి…. ఓటు మాత్రం మీ మ‌న‌స్సాక్షి ప‌రంగా ఓటు వేయండంటూ పిలుపు నిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -