తెలుగు ఇండస్ట్రీలో వరుసచ విషాద సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బుల్లితెర నటి ఝన్నీ ఆత్మహత్య చేసుకోగా,నిర్మాత జయ కూడా ఇటీవలే మరణించారు. తాజాగా మరో విషాద సంఘటన టాలీవుడ్లో జరిగింది.టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు కన్నుమూశారు. ఓ సీరియల్ షూటింగ్ జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆయన అప్పటికే మరణించినట్లుగా డాక్టర్లు తెలిపారు.
60 ఏళ్ల దీక్షితులు టాలీవుడ్ లో ఎక్కువగా పూజారి పాత్రల్లో నటించి , మెప్పించారు.మురారి సినిమాలో ఆయన చేసిన పూజారి పాత్రకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే అతడు సినిమాలో కూడా ఆయన నటించిన తీరుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. ఆగమనం సీరియల్ లో నటనకు నంది అవార్డు దక్కింది. ఇంద్ర, ఠాగూర్, ప్రాణం, వర్షం, ఎల్లమ్మ, మురారి, అతడు వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆయన ప్రస్తుతం సీరియల్స్లో నటిస్తు బిజీగా ఉన్నారు.ఆయన మృతికి సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.
- Advertisement -
టాలీవుడ్లో మరో విషాదం
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -