ప్రేక్షుడిని ఈ మధ్య దెయ్యం కథలు భాగా విసిగించేస్తున్నాయి. ఒక్కటి హిట్ అయితే చాలు…. పొలోమని పది దెయ్యం కథలు వచ్చి ఇట్టే చుట్టు ముట్టేస్తున్నాయి.దీంతో ప్రేక్షకులకు జస్ట్ సస్పెన్స్ ను చూసినా…. అది దెయ్యం కథేనేమో అనే భ్రమల్లో బతికేస్తున్నారు.
ఐతే ఇది ప్రేక్షకుడికి ఎలా ఉన్నా నిర్మాతలకు మాత్రం కాసులు కురిపిస్తూ ఉండడంతో అంతా ఈ యాంగిల్లోనే అడుగులు ముందుకు వేస్తున్నారు. తాజాగా వచ్చిన త్రిపుర విషయంలోను ఇదేజరిగింది.ఐతే ఈ సినిమాలో మన స్వాతిరెడ్డి పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నప్పటికీ సినిమా
మాత్రం కమర్శియల్ గా వర్కవుట్ అవ్వదంటున్నారు.గీతాంజలి చిత్రంతో నిలబడిన రాజ్ కిరణ్ ఈసినిమాతోను అలాంటి ప్రయత్నమే చేశాడు.
కాని అది వర్కవుట్ కాలేదు.సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు కథ ఏంటనేది చెప్పకుండా అలా లాగుతూనే ఉన్నాడు .కోన వెంకట్ సొంతం సినిమా కాబట్టి గీతాంజలిలో కామెడీ పండింది. కాని ఇది కోనది కాదు కాబట్టి… రాజ్ కిరణ్ సొంతం తెలివి తేటలు కావడంతో పేలిపోయింది. మొత్తానికి త్రిపురతో దెయ్యం భయాన్ని మనకు కలిగించాలని ట్రై చేసిన వారికి…ప్రేక్షకుడి దెబ్బకు త్రిపురకు ఎక్కిన దెయ్యం దిగిపోయింది.
{youtube}MWfflpyg2k0{/youtube}