Thursday, April 25, 2024
- Advertisement -

ఒకే ఫార్ములాతో సినిమాలు తీస్తున్న త్రివిక్రమ్

- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. అజ్ఞాతవాసి ప్లాప్ కావడంతో కాస్త గుర్తింపు తగ్గింది. అయితే ఇటీవలే అల వైకుంఠపురంలో మూవీతో పోగొట్టుకున్న గుర్తింపు రాబట్టుకున్నారు. అల వైకుంఠపురంలో బ్లాక్ బస్టర్ కావడంతో త్రివిక్రమ్ ని మళ్ళీ ఫాంలోకి వచ్చాడు. అందుకే ఎన్టీఆర్ తన కోసం ఎదురుచూస్తున్న టాప్ డైరెక్టర్స్ ని కాదని తన 30వ సినిమా మళ్ళీ త్రివిక్రమ్ తో కమిట్ అయ్యాడు.

ఇటివలే అధికారిక ప్రకటన కూడా చేసారు. ఈ మూవీకి ‘అయిననూ హస్తినకు పోయిరావలె’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే కనుక టైటిల్ అయితే త్రివిక్రమ్ మళ్ళీ తన హీరోని ఓ ఇంటికో ప్రాంతానికి పంపడానికి సిద్ధం అవుతున్నాడని అనుకోవాల్సిందే. హీరోలను అజ్ఞాతవాసానికి పంపడం త్రివిక్రమ్ కి అలవాటైపోయింది. అన్ని చిత్రాల్లో ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఆయన తీసిన మొదటి చిత్రం నువ్వే నువ్వే మినహా ఇస్తే.. రెండో సినిమా నుంచి ఒకే ఫార్ములాను వాడుకున్నారు.

అతడు మూవీలో క్రిమినల్ హీరో బాసర్లపూడి ఉమ్మడి ఫ్యామిలీకి వెళ్తాడు. జల్సా మూవీలో నక్సల్ పవన్ కళ్యాణ్ ని జనజీవన స్రవంతిలో కలిపి ఇలియానా లవర్ ని చేశారు. ఖలేజాలో డ్రైవర్ మహేష్ ని రాజస్థాన్ పంపించాడు. అత్తారింటికి దారేదిలో అత్త కోసం ఇండియాకు వస్తాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బన్నీని ఉపేంద్ర ఇంటికి పంపాడు. . అ ఆ లో హీరోని కాకుండా హీరోయిన్ ను మేనమామ ఇంటికి పంపాడు. అజ్ఞాతవాసి లో పవన్, అరవింద సమేతలో ఎన్టీఆర్ కూడా అజ్ఞాతవాసం చేశారు. ఇక తాజాగా వచ్చి హిట్ అయిన అల వైకుంఠపురంలో బన్నీని టబు ఇంటికి పంపాడు. ఇలా కెరీర్ మొదటి నుంచి త్రివిక్రమ్ ఒకే ఫార్కులాతో సినిమాలు తీస్తున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -