గత నాలుగు నెలలుగా కరోనా మహమ్మారి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. దాంతో ప్రజలు భయంతో బయటకు కూడా రావడం లేదు. ఇండియాలో కూడా కరోనా ఫ్రభావం తీవ్రంగా ఉంది. గత పది రోజులుగా పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ అన్ని ఆగిపోయాయి.
అయితే ఈ మధ్య లాక్ డౌన్ సడలింపుల వల్ల షూటింగ్స్ కి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. దాంతో సీరియల్స్ కి సంబంధించిన షూటింగ్స్ మొదలయ్యాయి. అయితే షూటింగ్స్ లో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికి నటీనటులు వైరస్ బారిన పడుతున్నారు. ప్రముఖ బుల్లితెర నటులైన నవ్య స్వామి, రవి కృష్ణలు ఈ కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే నవ్య తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా.. రవితో ఉన్న కొన్ని ఫోటోస్ ని షేర్ చేసింది. లాక్ డౌన్ తర్వాత ఆమె పలు షోస్ లో పాల్గొంది.
స్టార్ మా పరీవార్ లీగ్ అనే షోలో కూడా పాల్గొంది నవ్య. ఆ షో రెపటి నుంచి ప్రసారం అవుతుండటంతో.. మేము వస్తున్నాం అంటూ ఫోటోస్ ని షేర్ చేసింది. ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు త్వరగా కోలుకుని ఇలానే మళ్లీ షోస్లో పాల్గొనాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
మరో యాంకర్ ని ఆకాశానికి ఎత్తిన వర్మ.. చూస్తే షాక్..!
‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!