Wednesday, April 24, 2024
- Advertisement -

సంక్రాంతి బరిలో ఇద్దరు సీనియర్ హీరోయిన్లు

- Advertisement -

ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే సినీ ప్రియులకు కూడా పండుగ రోజు వచ్చినట్టు. సంక్రాంతి సందర్భంగా బోలెడు పెద్ద సినిమాలు విడుదల అవుతాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా కూడా కొన్ని పెద్ద సినిమాలు సంక్రాంతి బరిలో దిగనున్నాయి. అందులో ఒకటి అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ‘అల వైకుంఠ పురంలో’ సినిమా. మరొకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా. రెండు సినిమాలూ సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది విడుదల కనున్నాయి.

అయితే ఈ రెండు సినిమాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విజయశాంతి మళ్లీ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అల్లు అర్జున్ ‘అల వైకుంఠ పురంలో’ సినిమాతో కూడా బాలీవుడ్ లో సెటిలైన టబు మళ్లీ చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో నటించబోతోంది. ఇద్దరు సీనియర్ హీరోయిన్లు ఈ సినిమాలకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. మరి ఈ ఇద్దరిలో ఎవరి రీఎంట్రీ సినిమా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందో తెలియాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -