Friday, March 29, 2024
- Advertisement -

హీరోగా ప్రిన్స్ మేన‌ల్లుడు

- Advertisement -
  • మ‌హేశ్‌బాబు కుటుంబం నుంచి మ‌రో హీరో

సూప‌ర్ స్టార్ కుటుంబ‌మంతా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఏదో ఒక ప‌ని చేస్తూ ఉండిపోయింది. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానిది పెద్ద పాత్రే. సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబం ప‌రిచ‌య‌మైంది. అప్ప‌టి నుంచి మూడు త‌రాల దాక సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఉండిపోతున్నారు. కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, మ‌హేశ్‌బాబు, న‌మ్ర‌త‌, మంజుల, న‌రేశ్‌, సుధీర్‌బాబు, న‌వీన్ విజ‌య్‌కృష్ణ ఇలా చెప్పుకుంటూ ఆ కుటుంబమంతా సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన వారే ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబం నుంచి మ‌రో న‌టుడు రాబోతున్నాడు.

మ‌హేశ్‌బాబు మేన‌ల్లుడు సినీ అరంగేట్రం చేయ‌నున్నాడు. ప్రిన్స్ మ‌హేశ్‌బాబు బావ, గుంటూరు ఎంపీ జ‌య‌దేవ్ గ‌ల్లా త‌న‌యుడు అశోక్ గ‌ల్లా సినిమా రంగంలోకి రాబోతున్న‌ట్టు స‌మాచారం. హీరోగా అరంగేట్రానికి అన్ని ఏర్పాట్లు సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే అశోక్ న‌ట‌న‌లో శిక్ష‌ణ తీసుకుంటున్నాడ‌ని టాక్‌. అశోక్‌ను చూస్తుంటే సినీ హీరోగా రాణించే అవ‌కాశాలు ఉన్నాయి.

విజ‌య‌వంత‌మైన నిర్మాత‌గా పేరొందిన దిల్ రాజు అశోక్‌ను వెండితెర‌కు ప‌రిచ‌యం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాను తీయ‌నున్నాడు. ఇంత‌కు అశోక్ ఎవ‌రంటే మహేశ్‌బాబు సోదరి పద్మావతి కుమారుడు. ప‌ద్మావ‌తి గ‌ల్లా కుటుంబానికి కోడ‌లిగా వెళ్లింది.

ప్ర‌స్తుతం మహేశ్‌బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను సినిమాలో న‌టిస్తున్నాడు. దేవిశ్రీప్ర‌సాద్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. స్పైడ‌ర్ అంద‌రికీ న‌చ్చినా అంత‌గా విజ‌యం సాధించలేదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -