Tuesday, April 23, 2024
- Advertisement -

చిరంజీవి అప్రూవల్ తోనే వాల్మీకి

- Advertisement -

తమిళం లో విడుదల అయ్యి పెద్ద విజయం సాధించిన సినిమా జిగర్తాండ. ఈ సినిమా ని తెలుగు లో వాల్మీకి అనే పేరు తో విడుదల చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఈ సినిమా యొక్క థియాట్రికల్ రైట్స్ మొత్తం 25 కోట్లకి అమ్మినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఏ ఏరియా లో ఇంతకీ అమ్మారు అనే విషయం మీద క్లారిటీ చాలా మందికి లేదు. వాల్మీకి సినిమా యొక్క థియాట్రికల్ రైట్స్ సింగిల్ గా దక్కించుకోవాలని చాలా మంది ప్లాన్ చేసినా చివరికి అన్ని సినిమాల్లాగే ఈ సినిమా బేరసారాలు సాగాయి.

ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గరకు రావడం తో, చిత్ర యూనిట్, ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ ని ఫాస్ట్ గా పూర్తి అయ్యేలా చూస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగం గా వరుణ్ తేజ్ ఈ రోజు ఇంటర్వూస్ ఇస్తూ ఒక ఆసక్తికర విషయం తెలిపారు.

“ఈ సినిమా కథ పూర్తి కాగానే, చిరంజీవి గారికి మొత్తం కథ వినిపించాము. ఆయనకీ నచ్చి ఆయన ఓకే చేసాక నే ఈ సినిమా ని మొదలుపెట్టాను.” అని వరుణ్ తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -