Wednesday, April 24, 2024
- Advertisement -

శ్రీవారి ఆస్థానంలో ‘మహర్షి’ బృందం

- Advertisement -

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ‘మహర్షి’ సినిమా చాలా కీలకమైనదని తెలిసిన విషయమే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు మైలు రాయి చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. దిల్ రాజు, అశ్వినీ దత్, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మే 9న విడుదలైంది. అనుకున్నట్లుగానే ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటోంది.

ఈ నేపథ్యంలో నిర్మాత దిల్ రాజు మరియు దర్శకుడు వంశీ పైడిపల్లి తిరుపతి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకొని వచ్చారు. అక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘మహర్షి’ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందని, అందుకే స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమల వచ్చినట్లు తెలిపారు. ఈ సినిమాలో మహేష్ బాబు మూడు సరి కొత్త లుక్స్ తో ప్రేక్షకులకు ను అలరించాడు. కాలేజీ స్టూడెంట్ గా, మరియు పెద్ద కంపెనీకి సీఈఓగా మాత్రమే కాక ఒక రైతు పాత్రలో కూడా మహేష్ బాబు తన నటనతో అందరినీ మెప్పించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -