Saturday, April 20, 2024
- Advertisement -

మ‌రో క్రేజీ ద‌ర్శ‌కుడిని ప‌ట్టేసిన వ‌రుణ్ తేజ్‌

- Advertisement -

మెగా ప్రీన్స్ వ‌రుణ్ తేజ్ వ‌రస హీట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు. రెండు సినిమాలతో బిజిగా ఉన్న వ‌రుణ్ మ‌రో సినిమాను అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే రెండు హిట్ల‌తో మంచి ఫాంలో ఉన్న వ‌రుణ్ …త‌న త‌రువాత సినిమాల‌పై చాలా సెలక్టివ్‌గా క‌థ‌ల‌ను ఎంచుకుంటు త‌న కెరీర్‌ను మ‌లుచుకుంటున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2 ,ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డితో మ‌రో సినిమా చేస్తున్నాడు వ‌రుణ్.తాజాగా వ‌రుణ్ తేజ్ ‘సినిమా చూపిస్త మావ’ .. ‘నేను లోకల్ వంటి హిట్ సినిమాల ద‌ర్శ‌కుడు నక్కిన త్రినాథరావుతో సినిమా చేయ‌నున్నాడ‌ని తెలుస్తుంది.

నక్కిన త్రినాథరావు వరుణ్ తేజ్‌ను కలిసి ఒక కథను వినిపించడం .. కథ బాగుందంటూ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయట. వరుణ్ తేజ్ రెండు సినిమాలను పూర్తి చేసిన త‌రువాత నక్కిన త్రినాథరావుతో సినిమాను సెట్స్ పైకి తీసుకువ‌స్తార‌ని స‌మాచారం. నక్కిన త్రినాథరావు ప్రస్తుతం రామ్ హీరోగా ‘హలో గురు ప్రేమకోసమే’ చిత్రాన్ని చేస్తున్నాడు.ఈ సినిమా ద‌స‌రాకు విడుద‌ల చేయ‌నున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -