Friday, March 29, 2024
- Advertisement -

పూజ హెగ్డే తో డేట్ చేస్తా అంటున్న వరుణ్ తేజ్

- Advertisement -

‘ఎఫ్ 2:ఫన్ అండ్ ఫ్రస్టేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటించిన ‘గద్దలకొండ గణేష్’ తో మరొక సూపర్ హిట్ ను అందుకున్నాడు. తమిళ సినిమా ‘జిగర్తాండ’ కి రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్’ టాక్ షో కి వరుణ్ తేజ్ గెస్ట్ గా వచ్చారు. తన సినీ కరియర్ మరియు వ్యక్తిగత జీవితం గురించి బోలెడు విషయాలు బయట పెట్టారు వరుణ్ తేజ్. ఈ నేపధ్యంలో మంచు లక్ష్మి అడిగిన ఒక ప్రశ్నకి ఆసక్తికరమైన జవాబు ఇచ్చాడు మెగా హీరో.

రాశిఖన్నా, పూజా హెగ్డే, సాయిపల్లవి అని ఆప్షన్లు ఇచ్చి ఈ ముగ్గురిలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు, ఎవర్ని చంపేస్తావ్, ఎవరితో డేట్ కి వెళ్తావు అని మంచు లక్ష్మి అడగగా, వరుణ్ తేజ్ రాశి ఖన్నా ని చంపేస్తానని, పూజ హెగ్డే తో హుకప్ అయ్యి సాయి పల్లవి ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. సాయి పల్లవి తో వరుణ్ తేజ్ ‘ఫిదా’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది. మరోవైపు సెలబ్రిటీల జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్ లను బయట పెడుతున్న ఈ షో ఇప్పుడు వూట్ వెబ్ సైట్ లో వైరల్ గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -