Thursday, March 28, 2024
- Advertisement -

కొత్త పీఆర్ టీం సిద్ధం చేస్తున్న రౌడీ బాయ్

- Advertisement -

ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటినుంచి ఒక లెక్క అన్నట్టు అయిపోయింది విజయ్ దేవరకొండ పరిస్థితి. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికి ‘డియర్ కామ్రేడ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారడంతో విజయ్ దేవరకొండ లెక్కలు మారాయి. ఇప్పటిదాకా స్టార్ డం ను ఎంజాయ్ చేసిన ఈ యువ హీరో ఇప్పుడు ‘డియర్ కామ్రేడ్’ ఫెయిల్యూర్తో తన ఇమేజ్ దెబ్బ తిన్న విషయాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తన పీఆర్ టీం నీ మార్చాలని నిర్ణయించుకున్నాడట. ఇంతకుముందు కూడా విజయ్ పై ట్రోలింగ్ జరిగేది కానీ దానిని విజయ్ దేవరకొండ పెద్దగా పట్టించుకునేవాడు కాదు.

కానీ’ డియర్ కామ్రేడ్’ సినిమాతో ఈ నెగిటివిటీ బాగా ఎక్కువై పోవడంతో విజయ్ దేవరకొండ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పిఆర్ టీం సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న నెగిటివ్ కామెంట్లు పైన ఏది చేయలేకపోవడంతో విజయ్ టీం ని మార్చాలని చూస్తున్నారట. అయితే తన కెరీర్ మొత్తం మీద ఇప్పటి దాకా విజయ్ ఎప్పుడు ఫార్మల్ గా జర్నలిస్టులతో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఇతర స్టార్ హీరోలు ఏదో ఒక సందర్భంలో జర్నలిస్టు లతో మాట్లాడారు కానీ విజయ్ దేవరకొండ మాత్రం ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్బస్టర్ అయినప్పుడు కూడా సైలెంట్ గానే ఉన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -