Wednesday, April 24, 2024
- Advertisement -

సీనియర్ హీరోయిన్లకి షాకిస్తున్న విజయశాంతి

- Advertisement -

మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీ బిజీ గా గడుపుతూ ఇప్పుడు దాదాపు గా 13 ఏళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వస్తన్న నటి విజయశాంతి. త్వరలో అనిల్ రావిపూడి-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నాకెవరు అనే సినిమా లో ఒక కీలక పాత్ర పోషిస్తుంది విజయశాంతి. ఒకప్పుడు హీరోయిన్లు గా చేసి స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించిన చాలా మంది నటులు ఇప్పుడు రెండో ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్న మాట సహజమే. అయితే విజయ శాంతి కూడా ఈ కోవాలకే వస్తారు. కానీ మిగిలిన హీరోయిన్ల కన్నా విజయశాంతి కి ఇప్పుడు ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. తన కొలీగ్స్ కన్నా విజయ శాంతి మీద నే ప్రేక్షకులకి ఇంట్రెస్ట్ ఉండటం విశేషం.

అయితే విజయశాంతి దగ్గర ఉన్నదీ, మిగిలిన వాళ్ళ దగ్గర లేనిదీ ఏంటి అంటే అది ప్రెజెన్స్. విజయశాంతి సోషల్ మీడియా లో మంచి యాక్టివ్ గా ఉన్నారు. ఒక టీమ్ ని పెట్టుకొని ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండటం వలన విజయశాంతి ఏం చేస్తుంది అనే విషయం అభిమానులకి తెలుస్తుంది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టె ముందు ఇలాంటి ఒక వ్యూహం ఉండటం నిజం గా మంచిది. ప్రేక్షకులకి, అభిమానులకి మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -