Saturday, April 20, 2024
- Advertisement -

ఒకప్పుడు విక్రమ్ చేసిన తప్పు ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడా?

- Advertisement -

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ హీరోగా నటించిన సినిమా కాబట్టి సాహో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలా భారీ అంచనాల మధ్య సాహో సినిమా ఆగస్టు 10న విడుదలైంది. కానీ మొదటి రోజు నుంచి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ అందుకుంటుంది. విమర్శకులు మాత్రమే కాక అభిమానులు కూడా సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే సాహో సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనే విషయాలను విశ్లేషించగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ విక్రమ్ చేసిన తప్పు ఇప్పుడు ప్రభాస్ చేసినట్లు తెలుస్తోంది. అపరిచితుడు సినిమా బ్లాక్బస్టర్ అయ్యింది కానీ దాంట్లో క్రెడిట్ చాలావరకు శంకర్ కి దక్కింది.

ఆ విషయం గమనించకుండా విక్రమ్ తదుపరి సినిమా కందసామి కి సినిమాకి సుశీ గణేషన్ అనే దర్శకుడితో పని చేశాడు విక్రమ్. మల్లన్న అనే టైటిల్తో ఈ సినిమా తెలుగులో కూడా విడుదలైంది. విక్రమ్ మీద నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టారు. కానీ సినిమా విడుదలయ్యాక అంతే భారీగా నష్టపోయారు. మరోవైపు బాహుబలి సినిమా క్రెడిట్ కూడా చాలావరకు రాజమౌళికి దక్కింది. ప్రభాస్ ఒక యువ దర్శకుడి తో చేతులు కలిపారు. ప్రభాస్ మీద ఉన్న నమ్మకంతో నిర్మాతలు సైతం రాజీపడలేదు. కానీ మరొక ప్యాన్ ఇండియన్ సినిమా చేస్తున్నామన్న ఆలోచనలో పడిపోయిన ప్రభాస్ మిగతా విషయాలను పట్టించుకోలేదు. అందుకే ఇకనైనా మంచి కథ ఉన్న సినిమాలను ప్రభాస్ ఎంచుకుంటాడు అని అభిమానులు కూడా ఆశిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -