- Advertisement -
అతిలోక సుందరి శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ధడక్ సినిమాతో బాలీవుడ్కు పరిచియం అయింది. ఈ సినిమా నిన్న(శుక్రవారం) విడుదలైంది. జాతీయ అవార్డు అందుకున్న మరాఠీ మూవీ సైరత్కి రిమేక్గా ఈ సినిమా శుక్రవారం థియేటర్లలోని స్క్రీన్లపైకి వచ్చేసింది.తొలి మూవీలోనే జాహ్నవి అద్భుతంగా నటించి, తల్లికి నటనలోనూ వారసురాలినని నిరూపించుకుంది. సినిమాపై పాజిటివ్ రెస్పన్స్ రావడంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకు శ్రీదేవి కుతురు జాన్వీ కపూర్ ఎంత పారితోషికం తీసుకుని ఉంటుందో అని అందరిలోను ఓ ప్రశ్న మెదులుతుంది. ధడక్ సినిమాకు గాను, జాన్వీ కపూర్ అరవై లక్షల రూపాయల పారితోషికం అందుకున్నట్టు తెలిపింది. తన తొలి సినిమాకు 60 రూపాయల పారితోషికం తీసుకున్నానని జాన్వీ ఓ ఇంటర్య్వూలో తెలిపింది.