Thursday, April 25, 2024
- Advertisement -

నా భార్యాపిల్లలు అమెరికాలో ఉన్నారు : భావోద్వేగానికి గురైన మంచు విష్ణు

- Advertisement -

తన భార్యాపిల్లలు గురించి మంచు విష్ణు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. విషయంలోకి వెళ్తే.. కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూనే తన భార్యాపిల్లలు అమెరికాలో చిక్కుకుపోయారని విష్ణు తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎక్కడున్న వారు అక్కడే నిలిచిపోయారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా నిలిచిపోయాయి.

విదేశాల్లో ఉన్న భారతీయులు సొంత దేశానికి రాలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో మంచు విష్ణు చెప్పిన ఓ విషయం ఆందోళన రేకెత్తించింది. తన సతీమణి, పిల్లలు అమెరికాలోనే చిక్కుకుపోయారని ఆవేదన చెందారు విష్ణు. ఫిబ్రవరిలో తమ బంధువుల్లో ఒకరికి సర్జరీ ఉండటంతో తన భార్యాపిల్లలతో కలిసి అమెరికా వెళ్లానని.. అయితే తండ్రి మోహన్ బాబు బర్త్ డే వేడుకల నిమిత్తం తాను ముందుగానే అమెరికా నుంచి వచ్చేశాయని విష్ణు చెప్పారు.

ఇక తన భార్య విరానిక, పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్‌, ఐరా వద్దామనుకున్న సమయంలో మన దేశంలో పరిస్థితి విషమించి విమానాలు ఆపేయడంతో వాళ్ళు అక్కడే ఉండిపోయారని చెప్పారు. తన భార్య పిల్లలతో బాగా కనెక్ట్ అయి ఉంటానని.. అందుకే వారిని మిస్ అవుతున్నానని భావోద్వేగానికి గురయ్యారు మంచు విష్ణు. చాలా కష్టంగా ఉందని, తనలాగే చాలా మంది బాధ అనుభవిస్తూ ఉండొచ్చు.. కానీ కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ అనేది చాలా కీలకం కాబట్టి అందరూ సహకరించాలని ఆయన కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -