Saturday, April 20, 2024
- Advertisement -

ద‌గ్గుబాటి ఫ్యామిలీ ఓ వెబ్‌ సీరీస్‌?

- Advertisement -

యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు హ‌వా కొన‌సాగిస్తున్నాయి. ఇప్ప‌టికే బుల్లితెర‌పై సంద‌డి చేస్తున్న ద‌గ్గుబాటి రానా త్వ‌ర‌లో త‌న బాబాయి వెంక‌టేశ్‌తో క‌లిసి ఓ వెబ్‌సీరీస్‌లో న‌టించ‌నున్నాడ‌ట‌. అది కూడా మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హ‌త్యోదంతం గురించి తెర‌కెక్కిస్తున్నార‌ట‌. రాజ‌కీయాల‌ నేపథ్యంలో ఈ సీరీస్‌ను తెరకెక్కనుందని సమాచారం.

ఈ సీరీస్‌కి ‘ఎల్‌టీటీఈ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారంట‌. రాజీవ్ మ‌ర‌ణం చెప్పాలంటే మూడు గంట‌లు చాల‌ద‌ని వెబ్ సిరీస్‌గా చూపిస్తున్న‌ట్లు దర్శకుడు ఏఎంఆర్‌ రమేశ్ తెలిపారు. మొదటి ఎపిసోడ్‌లో రాజీవ్‌ గాంధీ ఎలా హత్యకు గురయ్యారు అనే విషయం, ఆ తర్వాత ఎల్‌టీటీఈ చీఫ్‌ వి.ప్రభాకరన్‌ గురించి చూపిస్తాం. ఈ సిరీస్‌లో వెంకటేశ్ ఐపీఎస్‌ అధికారి కార్తికేయన్‌గా నటించే అవకాశం ఉంది. రానా పాత్ర కూడా కీలకమే. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు ఇలా అన్ని భాషల్లోనూ తెరకెక్కించాలనుకుంటున్నాం.’ అని రమేశ్‌ మీడియా ద్వారా వెల్లడించారట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -