Saturday, April 20, 2024
- Advertisement -

అల్లరి నరేష్ భార్య ఏ పని చేస్తారో తెలుసా ?

- Advertisement -

దివంగత దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ గారి చిన్న కుమారుడు అల్లరి నరేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గత కొన్నాళ్లుగా తనదైన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అల్లరి నరేష్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 55 చిత్రాలలో నటించాడు. ఫస్ట్ మూవీ అల్లరితో అల్లరి నరేష్ గా పేరు మార్చుకున్నాడు. హీరోగా చేస్తూనే కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి మంచి ప్రశంసలు అందుకున్నాడు. ముఖ్యంగా ‘గమ్యం’ ‘శంభో శివ శంభో’ ‘బెండు అప్పారావు’ ‘బ్లేడ్ బాబ్జీ’ ‘సీమ శాస్త్రి’ ‘అత్తిలి సత్తిబాబు’ ‘నేను’ ‘కితకితలు’ ‘కత్తి కాంతారావు’ ‘మహర్షి’ సినిమాల్లో అల్లరి నరేష్ నటన అద్భుతమని చెప్పాలి.

ఇప్పటికీ చిన్న నిర్మాతలకు వరంగా ఉంటున్నాడు అల్లరి నరేష్. ఇది ఇలా ఉండగా.. అల్లరి నరేష్ తన తండ్రి మరణం తర్వాత నాలుగేళ్లకు 2015 మే 29న చెన్నయ్ చెందిన విరూపని పెళ్లి చేసుకున్నాడు. అయితే నిజానికి విజయవాడకు చెందిన అమ్మాయి అయినప్పటికి ఆమె తల్లిదండ్రులు ఉద్యోగాల రీత్యా చెన్నైలో సెటిల్ అయ్యారు. విరూప సినీ హీరోని పెళ్లి చేసుకున్నప్పటికి ఆమె ఎక్కువగా సినిమాలు చూడదట. పెళ్లైన రెండు వారాలకు నరేష్ నటించిన నేను సినిమా చూసిందట. అంతేకాకుండా విరూపకు సొంత కాళ్లపై నిలబడటం ఇష్టమట. అందుకే ఆమె భర్త సంపాధనపై ఆధారపడకుండా జీవించాలని నిర్ణయించుకుందట.

అందుకే ఆర్కిటెక్ట్ గా పనిచేస్తుందట. అల్లరి నరేష్ దంపతులకి ఇప్పుడు ఒక పాప కూడా ఉంది. పాప పేరు ఇవికా. అల్లరి నేరేష్ తన భార్యా పిల్లలకి సంబంధించిన విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. అల్లరి నరేష్ ప్రస్తుతం ’నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీని దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సినిమాకు పనిచేసే కార్మికులందరికీ అల్లరి నరేష్ – సతీష్ వేగేశ్నతో కలిసి ప్రతి ఒక్క కార్మికుడికి రూ.10 వేలు అందజేసి మంచి మనసును చాటుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -