బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పక్కన భరత్ అను నేను మూవీలో హీరోయిన్గా కనిపించింది. సినిమాలో కైరాకు పెద్దగా నటించడానికి ఏమి లేకపోయిన ఉన్నంతలో బాగానే చేసింది.కైరా ఫ్రెష్ లుక్కి చాలామంది ఫిదా అయ్యారు.దీంతో ఆమెకు తెలుగులో పెద్ద హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తుందని అందరు భావించారు.అనుకున్నట్టుగానే రాంచరణ్-బోయపాటి సినిమాలో హీరోయిన్గా కైరాను తీసుకున్నారు.
ఇంకా రెండు మూడు సినిమాలలో కైరా అద్వానీని తీసుకొవాలి భావిస్తున్నారని సమాచారం.కైరా కూడా బాలీవుడ్ని వదిలి టాలీవుడ్పై పోకస్ పెట్టింది.మరి ఇటువంటి సమయంలో బాలీవుడ్లో ఓ అడల్ట్ మూవీలో యాక్ట్ చేసింది కైరా అద్వానీ.లస్ట్ స్టోరీస్(హౌస్ నెట్ ఫ్లిక్స్) అనే వెబ్ సిరీస్లో నటించింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏమిటంటే ఓ ముగ్గురు జీవితంలో తమకు ఇష్టం లేని వారిని పెళ్లి చేసుకుంటారు.వారు తమకు ఇష్టమైనా వారితో ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకుంటారు.ఇందులో కైరా సెక్సీ లుక్ని చూసి జనాలు విస్తుపోతున్నారు. ఇలాంటి సినిమాలో కైరా ఎందుకు నటించిందని ఆమెపై మండిపడుతున్నారు.
తెలుగుతో పాటు బాలీవుడ్లో కైరాకు మంచి అవకాశాలే వస్తున్నాయి, మరి ఇలాంటి సందర్భంలో కైరా అద్వానీ ఇలాంటి అడల్ట్ సినిమాలు చేస్తే అవకాశాలు తగ్గుతాయనే భావన ఆమె ఫ్యాన్స్ భయపడుతున్నారు.మరి దీనిపై కైరా ఎలా స్పందిస్తుందో చూడాలి.ఈ అడల్ట్ సినిమాలో కైరా అద్వానీతో పాటు రాధికా ఆప్టే, భూమి పడ్నేకర్, మనీషా కోయిరాలా నటించారు.నిన్న(శనివారం) ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.