బిగ్బాస్ నిన్నటి(శుక్రవారం) ఎపిసోడ్లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లను తిరిగి బిగ్బాస్ ఇంట్లోకి పిలిచి షాక్ ఇచ్చారు బిగ్బాస్.హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన రోల్ రైడా,అమీత్,తేజస్వీ,బాబు గోగినేని,కిరీటి,శ్యామల,సంజనా,నందిని,భాను శ్రీ లు హౌస్లోకి రీ-ఎంట్రీ ఇచ్చి హోస్మెట్స్కు షాక్ ఇచ్చారు.హౌస్మెట్స్ అందరు ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేశారు.హౌస్లో తమ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు.
ఇక్కడి వరకు బాగానే ఉంది కాని,హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లందరు వచ్చారు కాని ఒక్కరు తప్ప.ఆయనే నూతన్ నాయుడు.నూతన్ నాయుడు ఒక్కడే ఎలిమినేట్ అయిన వారిలో రాలేదు.అయితే నూతన్ నాయుడు రాకపోవడంపై కౌశల్ కన్నీరు పెట్టకున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే కౌశల్కు హౌస్మెట్స్లో ఎవరైన స్నేహితులు ఉన్నారంటే అది ఖచ్చితంగా నూతన్ నాయుడు.కౌశల్ కూతురి పుట్టిన రోజున కౌశల్ ఇంటికి వెళ్లి మరి ఆ పాపను ఆశీర్వదించిన నూతన్ నాయుడు,తన స్నేహితుడు ఫైనల్కు చేరితే తన మద్దతు తెలిపాలి కాని, ఇలా రాకుండా ఎందుకు ఉన్నాడని చాలా మంది నూతన్ను ప్రశ్నిస్తున్నారు.అయితే నూతన్ నాయుడు రాకపోవడానికి ఓ కారణం ఉందని తెలుస్తుంది.
బిగ్బాస్లో ఓ టాస్క్లో గేమ్ ఆడుతున్న నూతన్ నాయుడు భుజానికి గాయం అయిన సంగతి అందరికి తెలిసిందే.ఆ గాయనికి అప్పట్లోనే సర్జరీ చేయలని డాక్టర్లు చెప్పడంతో, బిగ్బాస్ పూర్తి అయిన తరువాత చేయించుకుంటానని నూతన్ డాక్టర్లుకు చెప్పాడని తెలుస్తుంది.దీనిలో భాగంగానే ఆయన తన భుజానికి ఆపరేషన్ చేయించుకుని ఆసుపత్రిలో ఉన్నాడని, దీని కారణంగానే నూతన్ నాయుడు బిగ్బాస్లో నిన్నటి ఎపిసోడ్కు రాలేదని తెలుస్తుంది.ఈ విషయం తెలుసుకున్న కౌశల్ బాధపడుతు ,కన్నీరు పెట్టుకున్నాడట.