బిగ్బాస్ మూడవ సీజన్ ఆసక్తికరంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ 15 మంది కంటెస్టెంట్ లతో మొదలైన షో ఇప్పుడు 13 మంది మిగిలారు. రెండవ వారంలో తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది కానీ మూడవ వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. మొదటి వారం హేమ బిగ్బాస్ ఇంటి నుంచి బయటికి వెళ్లి పోగా 2వ వారం జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఇక నాలుగవ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అని ఆసక్తి అందరిలోను మొదలైంది.
ఈవారం ఎలిమినేషన్స్ లో ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. వారు వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవి కృష్ణ, రాహుల్ సిప్లిగంజ్, శివ జ్యోతి మరియు రోహిని. మరి ఈ వారం బిగ్ బాస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అని ఇంకా తెలియాల్సి ఉంది. నిన్నటితో ఓటింగ్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఇవాళ నాగార్జున ఏడుగురిలో ఇద్దరు లేదా ముగ్గురు కంటెస్టెంట్స్ ని సేఫ్ జోన్ లోకి పంపి రేపు మిగిలినవారిలో ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారో ప్రకటించనున్నారు.