Saturday, April 20, 2024
- Advertisement -

పాత‌బ‌స్తీలో మ‌రో ప్రేమ‌పెళ్లి వివాదం..ఆత్మ‌హ‌త్య‌కు య‌త్నించిన యువ‌కుడు

- Advertisement -

మొన్న మిర్యాలగడ పరువు హత్య విషాద ఛాయ‌లు మ‌రువ‌క ముందే మంగళవారం హైదరాబాద్ నగరంలో మరో సంఘటన చోటుచేసుకుంది. కులాంత వివిహం చేసుకుందన్న కార‌ణంగా అమ్మాయి తండ్రి కూతరు, అల్లుడుపై విచక్షణా రహితంగా కత్తితో దాడిచేశాడు. దీంతో కూతురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

ఈ రెండు సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌క‌ముందే పాద‌బ‌స్తీలో అలాంట సంఘ‌ట‌న చోటుచేసుకుంది. అయితే కాకపోతే ఇక్కడ దాడి జరగలేదు కానీ.. ప్రేమికులను విడదీశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని ఆమె తండ్రి తన నుంచి దూరం చేయడంతో సంతోషనర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

వివ‌రాల్లోకి వెల్తే .. సంతోష్‌ నగర్‌ పీఎస్‌ పరిధిలోని రక్షపురంకు చెందిన చిట్టిపాక శ్రీకాంత్‌ అనే యువకుడు నాలుగు సంవత్సరాల క్రితం ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు ఇందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖలో పనిచేస్తున్న అమ్మాయి తండ్రి షన్ముగచారి ఆమెను ఇటీవల బలవంతంగా ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం సదరు యువతిని బెదిరించి శ్రీకాంత్ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెట్టించాడు. దీనికి తోడు ఏడు నెలల గర్భవతైన శ్రీహర్షకు ఆమె తండ్రి అబార్షన్ చేయించినట్లు తేలింది.

దీంతో ఈ ఘటనపై తీవ్ర మనస్తాపానికి లోనైన శ్రీకాంత్ సూసైడ్ నోట్ వాట్సాప్ లో పెట్టిన శ్రీకాంత్ నిన్న రాత్రి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చనిపోయేముందు శ్రీకాంత్ సెల్ఫీ వీడియోను తీసుకున్నాడు. 90 శాతం కాలిన గాయాలైన శ్రీకాంత్ బతికే అవకాశాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -