- Advertisement -
అనంతపూర్ జిల్లా తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పనిచేస్తున్న హరి వరుణ్ రెడ్డి అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చేందాడు. హరి వరుణ్ రెడ్డి గత కొన్నేళ్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు.
హరి వరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడన్న ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, అనుమానాస్పద మృతిగా కేసును నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.