- Advertisement -
ఫోలింగ్ వేల ఛత్తీస్ గడ్ లో మావోయిస్టులు చెలరేగిపోయారు. బీజాపూర్ జిల్లాలో మంగళవారం సాయంత్రం దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్ ని మందుపాతరతో పేల్చేశారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సహా ఆరుగురు దుర్మరణం చెందారు. కౌకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్గిరిలో ఈ దాడి జరిగింది. ఐఈడీ పేలడంతో కాన్వాయ్లోని వాహనం తునాతునకలైంది.
సంఘటన జరిగిన వెంటనే సీఆర్పీఎఫ్ బలగాలు అక్కడికి చేరుకున్నారు. భద్రతా బలగాలకు, మావోలకు కాల్పులు కొనసాగుతున్నాయి. చత్తీస్గఢ్లో లోక్సభ ఎన్నికల్లో మూడు విడతల్లో జరగనున్నాయి. తొలి విడత జరిగే రెండు రోజుల ముందే మావోయిస్టులు దాడి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.