Tuesday, April 23, 2024
- Advertisement -

ప్రేమ వివాహం.. మిర్యాల‌గూడ‌లో ప‌ట్ట‌ప‌గ‌లు భార్య ముందే భ‌ర్త దారుణ హ‌త్య‌..

- Advertisement -

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దారుణం చోటుచేసుకుంది.ప‌ట్ట‌ప‌గ‌లే మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్లు ప్రణయ్ అనే యువకుడు దారుణ హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ సంఘ‌ట‌న మిర్యాల గూడ‌లో సంచ‌ల‌నంగా మారింది. ఈ హ‌త్య‌కు ప్రేమ వివాహ‌మే కార‌ణ‌నే తెలుస్తోంది. అత్యంత రద్దీగా ఉండే జ్యోతి హాస్పటల్ సమీపంలో వినోభానగర్ కు చెందిన పెరుమళ్ల ప్రణయ్ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు.

పెరుమాళ్లు ప్రణయ్ అనే యువకుడు అదే పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ కుమార్తె అమృతను ప్రేమించి ఇటీవలే వివాహం చేసుకున్నాడు. వీరి ప్రేమ వివాహాన్ని అమ్మాయి త‌ల్లిదండ్రులు ఒప్పు కోలేద‌ని తెలుస్తోంది. అమృత తండ్రే తన కొడుకును హత్య చేయించాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

అమృత గర్భవతి కావడంతో జ్యోతి ఆస్పత్రికి తీసుకువచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రణయ్‌పై వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి కత్తితో నరికి చంపాడు. ఈ దాడిలో ప్రణయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. భర్తను తన కళ్లెదుటే దారుణంగా నరికి చంపటంతో అమృత షాక్‌కు గురైంది. దాడి ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయింది.

తల, మెడపై బలంగా కత్తితో నరకడంతో.. అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలొదిలాడు. ఇక ప్రణయ్ భార్య అమృత, మరో మహిళ భయంతో పరుగులు పెడుతూ తిరిగి ఆస్పత్రిలోకి చేరుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అమృత తండ్రే తన కొడుకును హత్య చేయించాడని మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అమృతవర్షిణి ప్రస్తుతం ఆరుమాసాల గర్భిణీ.అమృత వర్షిణీని ప్రణయ్ ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ఈ ప్రేమ వివాహం సందర్భంగా అమ్మాయి తరపు కుటుంబసభ్యులు గొడవ చేశారు. అయితే ప్రస్తుతం ప్రణయ్ తన భార్య అమృతవర్షిణితో కలిసి బాలాజీనగర్ లో నివాసం ఉంటున్నాడు. వీడియో చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -