వికారాబాద్లో మూడు రోజుల క్రితం కిడ్నాప్కు గురైన దీపిక కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. తాను ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్తో వెళ్లినట్టు పోలీసులకు దీపిక ఫోన్ చేసి చెప్పినట్టు సమాచారం. వికారాబాద్కు చెందిన దీపిక, అఖిల్ 2016లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి పెళ్ళి దీపిక తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో రెండేళ్ల క్రితం ఆమెని ఇంటికి తీసుకొచ్చేశారు.
అనంతరం తల్లిదండ్రులు బలవంతం చేసి అఖిల్ నుంచి విడాకులు కోరుతూ దీపికతో కోర్టులో పిటిషన్ దాఖలు చేయించినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శనివారం వీరిద్దరు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అయితే ఆదివారం సాయంత్రం దీపిక షాపింగ్కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా ఓ కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దీపికను బలవంతంగా ఎత్తుకెళ్ళినట్టు ఆమె తల్లిదండ్రులు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే గత మూడు రోజులగా దీపిక ఆచూకీ కోసం ఆరు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చేపట్టారు. అయితే కొద్దిసేపటి క్రితం ఇష్టపూర్వకంగానే తన భర్త అఖిల్తో వెళ్లినట్టు దీపిక పోలీసులకు ఫోన్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే పోలీసుల సూచన మేరకు దీపిక, అఖిల్ వికారాబాద్ పోలీస్ స్టేషన్కి రానున్నారు.