Wednesday, April 24, 2024
- Advertisement -

క‌ర్నూలుజిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం..ఆటోను ఢీకొట్టిన లారీ

- Advertisement -

క‌ర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కొత్తపేట గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. బనగానపల్లె నుంచి కొత్తపేటకు విద్యార్థులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తోన్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌ రాంచంద్రుడు(30)తో పాటు ఇద్దరు 9వ త‌ర‌గ‌తి విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి

మృతులు బనగానపల్లెకి చెందిన ఎం.చెన్నకేశవ(14), రామకృష్ణాపురానికి చెందిన సి.వెంకట శివుడు(14)గా గుర్తించారు. ఇద్దరూ కొత్తపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గాయపడిన విద్యార్థిని బనగానపల్లె తరలించారు. ఈ ప్రమాదంలో లారీ పల్టీ కొట్టి పక్కనున్న పొలాల్లో బోల్తా పడింది. ఈ మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -