Friday, March 29, 2024
- Advertisement -

కొడుకు వైరల్ చేసిన తండ్రి రాసలీలల వీడియో..?

- Advertisement -

ఈమధ్య పెద్ద స్థాయిలో ఉన్నవారు కూడా అక్రమ సంబంధం మోజులో పడి తమ జీవితాన్ని నాశనం చేసి తన ను నమ్ముకున్న వారి నమ్మకాన్ని కోల్పేయేలా చేసుకుంటున్నారు.. తాజాగా తండ్రి రాసలీలలతో మునిగి తేలుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న కొడుకు ఆ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.. మధ్యప్రదేశ్ పోలీసు శాఖలో పురుషోత్తం శర్మ డిజీ స్థాయి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన 32 సంవత్సరాల క్రితం పద్మజా జోషిని వివాహం చేసుకున్నాడు. అయితే 2008 లో పద్మజా తన భర్తపై వేధింపుల కేసు నమోదు చేసింది. అప్పటి నుంచి భర్తతోనే ఉంటున్నది. ఈ మధ్య ఒక మహిళను భార్యలేని సమయంలో ఏకంగా ఇంటికే తీసుకువస్తూ సరసాలు సాగిస్తున్నాడు.

మరో మహిళను తీసుకువచ్చాడనే విషయం తెలుసుకున్న ఆమె వెంటనే తలుపుతట్టింది. దీంతో ఆగ్రహం కట్టలుతెంచుకున్న పురుషోత్తం శర్మ భార్య పద్మజా జోషిపై భౌతిక దాడికి దిగాడు. ఇది చూసిన పెంపుడు కుక్క అరుస్తూ నిలువరించే ప్రయత్నం చేసింది. అయినా ఆగకుండా ఆమెపై దాడికి దిగాడు. ఈ తతంగం మొత్తం సీసీటీవీలో రికార్డు అయ్యింది. ఈ ఫుటేజీని కుమారుడు, ఐఆర్ఎస్ అధికారి పార్థ్ గౌతమ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తండ్రిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మధ్యప్రదేశ్ సీఎం, హోం మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసి వీడియో పంపించారు.

సోషల్ మీడియాలో పురుషోత్తం వీడియో వైరల్ కావడం, కుమారుడు ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఆయనను విధులనుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వీడియో తాను కూడా చూశానని, విచారణ తరువాత మిగతా చర్యలు తీసుకుంటాని హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -