Friday, April 26, 2024
- Advertisement -

ప్రేమ‌పేరుతో సైకోగామారి విద్యార్థిని గొంతు కోసిన ఉపాధ్యాయుడు…

- Advertisement -

ఆధునిక యుగంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. కంటికి రెప్పలా కాపాడాల్సిన ఉపాధ్యాయులు కాలనాగులై విద్యార్థులను కాటేస్తున్నారు. వారి జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు.

తాజాగా ఓ ఉపాధ్యాయుడు ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధిస్తున్నాడు. ఆమె తిరస్కరించడంతో తప్పతాగి ఇంటికి వెళ్లి ఈ రోజు బాధితురాలి గొంతును కోసేశాడు. అనంతరం తానూ ప్రాణాలు తీసుకునేందుకు యత్నించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

కర్నూలు పట్టణంలోని బంగారుపేట కాలనీలో బాధితురాలు ఉంటోంది. అక్కడే స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఈ నేపథ్యంలో అక్కడే హిందీ టీచర్ గా పనిచేస్తున్న శంకర్ బాలికపై కన్నేశాడు. తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. వేధింపులు భ‌రించ‌లేక బాలిక త‌ల్లిదండ్రుల‌కు చెప్పింది. దీంతో తల్లి, ఇతర కుటుంబ సభ్యులు శంకర్ ను హెచ్చచిన ప్రవర్తన మార్చుకోని ఆ ప్రబుద్ధుడు యువతిని వేధించ‌డం మొద‌లు పెట్టారు.

ఇంట్లో కుటుంబ సభ్యులు లేకపోవడంతో కత్తితో దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించి గట్టిగా అరవడంతో స్థానికులు పరుగున వచ్చారు. అప్పటికే ఆమె రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతోంది. అనంతరం తానూ గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ సందర్భంగా బాలిక అరుపులు విన్న స్థానికులు అక్కడకు చేరుకుని శంకర్ ను చితకబాదారు. బాధితురాలిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి, శంకర్ ను చెట్టుకు కట్టేశారు. ఉపాధ్యాయుడి చేతిలో తీవ్రగాయాలపాలైన విద్యార్థినిని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -