Saturday, April 20, 2024
- Advertisement -

స్కూటీ బాగు చేస్తామని యువతినిపై దుండగుల దారుణం..!

- Advertisement -

రోజు రోజు మహిళలపై దారుణాలు పెరిగిపోతున్నాయి. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు.. మృగాలా ప్రవర్తిస్తున్నారు కొందరు. వీరికి ఎన్ని శిక్షలు వేసి.. ఇలాంటి దారుణాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్.. ఫరూక్ నగర్ మండలం చటాన్ పల్లిలో అత్యంత దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని హత్య చేసి నిప్పంటించారు.

మృతురాలు వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న మదాపూర్ లోని హాస్పిటల్ కు వెళ్లిన ప్రియాంక.. తిరిగి రాత్రి తొమ్మిది గంటల సమయంలో శంషాబాద్ కు వచ్చింది. అప్పటి నుండి ప్రియాంక ఫోన్ స్విచ్చాఫ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ప్రియాంకరెడ్డి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ప్రియాంక స్వస్థలం కొల్లాపూర్ మండలం నర్సాయిపల్లి.

స్కూటీ పాడైందని తల్లిదండ్రులకు ఫోన్ లో చెప్పిన కాసేపటికే ఈ ఘటన జరిగిందని సమాచారం. తల్లి దండ్రులకు ఫోన్ చేసిన టైంలో చుట్టు లారీ డ్రైవర్లు ఉన్నారని భయంగా చెప్పిన ప్రియాంకరెడ్డి ఆ తర్వాత హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై ప్రియాంక సోదరి స్పందించింది.

టైర్ పంక్చర్ అయిందని.. పక్కన ఉన్న లారీ డ్రైవర్లు తాము బాగు చేస్తామని చెప్పడంతో ఆమె మళ్లీ ఫోన్ చేస్తానని చెప్పి కట్ చేసిందని వివరించింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని తెలిపింది. ఈ క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ప్రియాంకను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు నిర్దారణకు వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -