మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవితం ఆధారంగా ’సైరా నరసింహరెడ్డి’ తెరకెక్కింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా వసుళ్ల ప్రభంజనం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపుగా 40కోట్ల కలెక్షన్స్ వసులు చేయగా.. ప్రపంచవ్యాప్తంగా వసూళ్లను కలుపుకుంటే 50- 60కోట్లు వసూల్ చేసి ఉండొచ్చు అని సినీ విశ్లేషకులు అంటున్నారు. సైరా: నరసింహారెడ్డి
తొలిరోజు ఏపీ, నైజాంలో వసూళ్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ నుంచి సైరా దాదాపు 39కోట్లు వసూలు చేసిందని తెలుస్తోంది.
సీడెడ్-6.30కోట్లు,
నైజాం-8.13కోట్లు,
వైజాగ్-4.72కోట్లు,
తూ.గో జిల్లా-5.34కోట్లు,
ప.గో జిల్లా-4.10కోట్లు,
నెల్లూరు-2.18కోట్లు,
కృష్ణ-3.03కోట్లు,
గుంటూరు-5.05కోట్లు,
ఇక ఈ చిత్రంలో చిరు సరసన తమన్నా, నయనతార నటించారు. అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్, బ్రహ్మాజీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.