ప్రపంచ వ్యాప్తంగా ’సైరా నరసింహా రెడ్డి’ సంచలన విజయం సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో ఊహించని కలెక్షన్స్ సాధించింది. వీకెండ్ లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. దాంతో మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్ మోడ్ కి వెళ్లారు. సినిమా సెలబ్రిటీలందరు ఈ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. గురువారం రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో జరిగిన పార్టీలో సైరా టీమ్ పాల్గొంది. అయితే ఈ పార్టీ అందరికి ఇచ్చినట్టే చిరుకు ఇచ్చారా ? ఏంటి అసలు కథ ? అంటూ కథనాలు మొదలయ్యాయి.
’సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కనిపించకపోవడం.. మెగా క్యాంప్ కి అల్లు అర్జున్ కి దూరం పెరిగినట్లు అభిమానులు విమర్శలు చేశారు. దానికి తోడు అల్లు అర్జున్ సీటీలో ఉన్నప్పటికి మెగా ఈవెంట్ కి రాకపోవడన్ని విమర్శించారు. ఇలాంటి విమర్శలన్నిటికి చెక్ పెట్టాలని అల్లు వారు ’సైరా’ పార్టీ ఇచ్చారా అన్న ముచ్చటా వినిపిస్తోంది.
ఇక ఈ పార్టీలో.. చిరంజీవి- సురేఖ దంపతులు, అల్లు అరవింద్, రామ్చరణ్, అల్లు అర్జున్, వరుణ్తేజ్, సాయిధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని, త్రివిక్రమ్, సుకుమార్, రత్నవేలు- శ్రీకాంత్, చిరు పెద్ద కూతురు సుష్మిత, పరిచురి బ్రదర్, సాయి మాధవ్, గంతా శ్రీనివాసరావు, సురేందర్ రెడ్డి, దిల్ రాజు, హరీష్ శంకర్, యూవీ వంశీ తదితరులు పాల్గొన్నారు.