Friday, March 29, 2024
- Advertisement -

జగన్ స్వీట్ వార్నింగ్…. చిక్కుల్లో రోజా….?

- Advertisement -

వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. జగన్ మంత్రి వర్గంలో చోటు దక్కుతాదనుకున్న రోజాకు చివరకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవి దక్కింది. మరో వైపు ప్రజాప్రతినిధిగా ఉంటూ ఇంకో వైపు జబర్దస్త్ ప్రోగ్రాంతో బిజీగా గడుపుతోంది. ఇదే ఇప్పుడు రోజాకు ఇబ్బందికరంగా మారింది. రెండు పడవల మీద రోజా ప్రయాణం చేస్తున్నారు. ఇదలా ఉంటె ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా సంపూర్ణంగా బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలం అవుతుందనె వాదనలు వనిపిస్తున్నాయి.

పరిపాలనలో అవినీతి లేకుండా చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారు. మంత్రులు, నేతల పనితీరు మీద జగన్ ఇంటెలిజెన్స్ నిఘా ఏర్పాటు చేశారు. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు గురించి ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. నివేదిక ఆధారంగా మంత్రులు, ఎమ్మెల్యేలు సూచలనలు, సున్నితంగా వార్నింగ్ లు కూడా ఇచ్చినట్లు సమాచారం.

ఇంటెలిజెన్స్ నివేదక రోజాకు వ్యతిరేకంగా ఉందంట. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోజాకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అటు జబర్దస్త్ షో, ఇటు ఏపీఐఐసీ చైర్మన్‌గా రెండు బండ్ల మీద సవారీ చేస్తున్న రోజాను.. ఏదో ఒకదానికి మాత్రమే పరిమితం కావాలని జగన్ సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. ఏపీఐఐసీచైర్ పర్సన్ గా విధులు సంపూర్ణంగా నిర్వహించాలంటే, జబర్దస్త్ షో మానేసి రాజకీయ బాధ్యతలు తీసుకోవాలని చెప్పినట్టు సమాచారం.

ఏపీఐఐసీ చైర్ పర్సన్ బాధ్యతలు సరిగా నిర్వర్తించలేరని, కాబట్టి టీవీ షోకు ఫుల్ స్టాప్ పెట్టి ఫుల్ టైమ్ పొలిటికల్ పగ్గాలు చేపట్టాలని జగన్.. రోజాకు స్పష్టం చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలా? అని రోజా డైలమాలో పడినట్టు సమాచారం. అయితే రోజా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -