- Advertisement -
దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ తో సందడి వాతావరణం నెలకొంది. అనేక మీడియా సంస్థలు ఏ పార్టీకి ఎంత ఆధిక్యం వస్తుంది? ఎవరిది ముందంజ? ఎవరిది పైచేయి? అంటూ రకరకాలుగా అంచనాలు వెలువరిస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీడీపీదే గెలుపని చెబుతుండగా, వీడీపీ అసోసియేట్స్ మాత్రం వైసీపీ ప్రభంజనం కొనసాగుతుందని తేల్చి చెప్పింది. వీడీపీ అసోసియేట్స్ అంచనాల ప్రకారం వైసీపీ 111 నుంచి 121 సీట్లు, టీడీపీ 54 నుంచి 60 సీట్ల వరకు గెలుచుకుంటాయట! జనసేనకు 4 స్థానాలు వస్తాయని వీడీపీ పేర్కొంది.
2019 శాసన సభ ఎగ్జిట్ ఫోల్ ఫలితాలు:
గెలిచేస్థానాల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం
- తెలుగుదేశం 54-60 0
- వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ 111-121 0
- జనసేన పార్టీ 4 0