Friday, March 29, 2024
- Advertisement -

శ్రీముఖి, మహేష్ మధ్య పెద్ద గొడవ.. అసలు ఏమైంది ?

- Advertisement -

బిగ్ బాస్ హౌస్ లో ఏదైన రచ్చ జరగడానికే హౌస్ బిగ్ బాస్ కంటెస్టెంట్లను రెచ్చగొట్టేలా టాస్క్ లను ఇస్తుంటాడు. టాస్క్ ల పేరుతో వారిలో ఉన్న నిజ స్వరూపాన్ని బయటకు లాగేందుకు ప్రయత్నిస్తుంటాడు బిగ్ బాస్. ఒక్కోసారి బిగ్ బాసే చిచ్చులు పేడుతుంటాడు. ఇంటి సభ్యులు ఒకరి దగ్గర ఒకరు మాట్లాడుకున్న విషయాలను మరో కంటెస్టేంట్స్ దగ్గర వినిపించి వారి వారికి ఫిట్టింగ్ లు పేడుతుంటాడు బిగ్ బాస్.

ఇంతకు ముందే.. ఇలాంటి చిచ్చును శ్రీముఖి, వితికాకు.. పునర్నవి, వితికాకు పెట్టాడు. దాంతో వితికాపై పునర్నవి అలిగిన విషయం తెలిసిందే. దసరా వేడుకలు బిగ్ బాస్ హౌస్ లో జరుపుకున్నారు. ఆ తర్వాత ఓ టాస్క్ తో వారి మధ్య గొడవలు పెట్టేందుకు బిగ్ బాస్ రెడీ అయ్యాడు. దానిలో భాగంగా.. అలీ తన గురించి మాట్లాడిన మాటలను బాబాకు వినిపించాడు. మహేష్ తన గురించి వెనకాల మాట్లాడిన విషయాలను శ్రీముఖికి తెలిసేలా చేశాడు.

దాంతో మహేష్ తో తాడో పేడో తేల్చుకునేందుకు శ్రీముఖి సిద్దమైనట్లు తెలుస్తోంది. మరి మిగిత వారి మధ్య ఎలాంటి గొడవలు పెట్టాడు. టాస్క్ లను ఎలా కంప్లీట్ చేశారు అనేది చూడాలి. దసరా రోజున ఇంటి సభ్యులకు సర్ ఫ్రైజ్ ఇచ్చేందుకు నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. దాంతో సందడి మొదలైంది. ఇంటి సభ్యులచేత నాగార్జున ఆటలు ఆడించాడు. అంతేకాకుండా స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇచ్చాడు. స్టార్ ఆఫ్ ది హౌస్ గా నిలిచిన వరుణ్, శివజ్యోతిలకు స్పెషల్ డిన్నర్ ను ఆఫర్ చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -