Friday, April 19, 2024
- Advertisement -

ప‌వ‌న్ క‌నీసం అపాయంట్ మెంట్ కూడా ఇవ్వ‌లేదు…

- Advertisement -

ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక్ల‌లో జ‌న‌సేన పార్టీ ఘోరంగా ఓడిపోవ‌డంతో సీనియ‌ర్ నాయ‌కులు పార్టీని వీడుతున్నారు. క‌నీసం పార్టీ అధ్య‌క్షుడే గెల‌వ‌లేక‌పోవ‌డంతో ఆ పార్టీపై తీవ్ర ప్ర‌భావం ప‌డింది. త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని కొంద‌రు నేత‌లు పార్టీని వీడుతున్నారు. తాజాగా పవన్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న రావెల కిషోర్ బాబు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికలకు ముందు టిడిపి నుండి జనసేన పార్టీలో చేరి, ఎన్నికల తర్వాత అనూహ్యంగా తన పార్టీకి గుడ్ బై చెప్పి బిజెపిలో చేరిపోయారు రావెల కిషోర్. అంతోనె ప‌వ‌న్‌పై విమ‌ర్శలు ఎక్కుపెట్టారు. పవన్ కళ్యాణ్ తనను ఎప్పుడూ గుర్తించలేదని, కనీసం గౌరవించలేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏనాడు రాజకీయాలకు సంబంధించి తనతో చర్చించిన దాఖలాలు లేవన్నారు. జనసేన కీలక నేతలతో తాను ఒకడినని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తనకు అంత ప్రయారిటీ ఇవ్వలేదన్నారు.

తన సలహాలు సూచనలు ఎప్పుడు పవన్ తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. తిరుపతిలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న రావెల కిషోర్ బాబు ఆ తర్వాత గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తనకు ఎప్పుడూ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కనీసం ఫోన్ అయినా మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. పార్టీలో తనకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన అన్నారు. జనసేన నుంచి బయటకు రాగానే రావెల ఇప్పుడు ఏకంగా జనసేనాని పైనే సంచలన ఆరోపణలు చేశారు. మరి రావెల తాజాగా చేసిన ఈ విమర్శలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -