టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు చెప్పడంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు అలా ఎందుకు చెప్పారా టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపై అధికార వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. రౌడీ షీట్, 62 కేసులు ఉన్న వ్యక్తిని రాజకీయాలకు స్పూర్తి అని చెప్పడం ద్వారా చంద్రబాబు నాయుడు తన వైఖరిని బయటపెట్టకున్నారని విమర్శించారు.
చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీషీటర్ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఫైర్ అవుతున్నారు. చింతమనేని ప్రభాకర్పై ఉన్న కేసులు, రౌడీషీటు అన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పెట్టారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చింతమనేని బాధితుల ఆవేదన ఎందుకు వినడం లేదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.