ఏపీలో టీడీపీ మళ్లీ విజయం సాధిస్తుందని ‘ఆంధ్రా ఆక్టోపస్’ లగడపాటి రాజగోపాల్ చేసినసర్వే పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.తాజాగా సినీ రచయిత చిన్ని కృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు వైసీపీ అధినేత జగన్ ‘సీఎం’ అవుతారని చాలా స్పష్టంగా, నిష్పక్షపాతంగా చెప్తుంటె…లగడపాటి మాత్రం తప్పుడు సర్వే ఇచ్చారన్నారు.
సర్వేలు చదివేప్పుడు.. మేం సైంటిఫిక్గా చెబుతున్నాము.. ఇది మేం తొంగి చూసి చెప్పింది కాదు.. మీరేం అనుకోవద్దని లగడపాటి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు . పెద్ద ఇంటిలిజెంట్లా మాట్లాడుతున్న రాజగోపాల్.. ముందు తన కుటుంబంపై సర్వే చేయించుకోవాలన్నారు. సినిమాలు ఎలా తీయాలో లగడపాటి తన తమ్ముడికి నేర్పించన్నారు.
వ్యాపారం చేయడం.. బ్యాంకుల్లో మధ్యతరగతి కుటుంబాలు డిపాజిట్ చేస్తే.. బ్యాంకులు మీకు లోన్లు ఇస్తే.. ఆ డబ్బును వాడుకొని ఎగ్గొట్టడానికి స్కెచ్ వేసిన నీ కుటుంబంలో నువ్వు సర్వే చేసుకో’అంటూ మండిపడ్డారు. ఎల్లోమీడియాకు రివర్స్ గేర్ మొదలైందన్న విషయం లగడపాటికి తెలుసని, అసత్య వార్తలకు ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. ‘మినిమమ్ 110, మ్యాగ్జిమమ్ 140 సీట్లతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో టీడీపీకి 50 కన్నా తక్కువ అసెంబ్లీ స్థానాలు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ఓట్లన్నీ తెలుగుదేశానికే పడ్డాయి కానీ, ఈవీఎంలు తప్పుగా చూపించాయని చంద్రబాబు అంటారని ఎద్దేవా చేశారు.