ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది వైసీపీ. ఎన్నికల్లో ఓడిన నేతలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు జగన్ న్యాయం చేస్తున్నారు. మంత్రి వర్గంలో చోటు దక్కని రోజాకు ఏపీఐసీసీ పదవి ఇచ్చిన జగన్ ….తాజాగా బాలయ్య చేతిలో ఓడిన నేతకు కీలక పదవి ఇవ్వనున్నారు సీఎం జగన్.
హిందూపురంనుంచి బాలయ్యచేతిలో ఓడిన ఇగ్బాల్కు జగన్ కీలక పదలో నియమించబోతున్నారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకపాటి సుచరిత సలహాదారులుగా ఇక్బాల్ను నియమించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారట. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయంట. రాష్ట్ర ప్రజల శాంతిభదత్రకు సంబంధించి హోంశాఖ కీలకం కావడంతో.. ప్రత్యేకంగా సలహాదారును నియమించినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజుల క్రితం రంజాన్ సందర్భంగా.. గుంటూరులోని పరేడ్ గ్రౌండ్స్లో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్.. ఇక్బాల్ను ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీపై చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఇగ్బాల్కు సలహాదారు పదవి ఇవ్వడంతో ఎమ్మెల్సీ ఇస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ఐజీగా పనిచేసిన ఇగ్బాల్ ఎన్నికలకు ముందు టీడీపీనుంచి వైసీపీలో చేరారు. జగన్ హిందూపురం టికెట్ కూడా కేటాయించారు. కాని బాలయ్య చేతిలో ఓడిపోయారు.