Saturday, April 20, 2024
- Advertisement -

రేప్ చేస్తే ఇలాగే చంపేస్తారా.. గుత్తా జ్వాల ప్రశ్న..!

- Advertisement -

దిశ హత్య కేసులో నిందితుల్ని తెలంగాణ పోలీసులు ఎన్‍కౌంటర్ చేయడంతో దిశకు న్యాయం జరిగిందని ప్రశంసలు కురిపిస్తున్నారు. దిశ ఆత్మ శాంతిస్తోందని సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా స్పందిస్తోంది. “గ్రేట్ వర్క్ హైదరాబాద్ పోలీస్… వియ్ సెల్యూట్ యు… ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇదే శిక్షను అమలు చేయాలి.

ఎవరైతే సమాజం విషయంలో బాధ్యత అన్నదే లేకుండా అత్యాచారాలతో తెగబడుతున్నారో వాళ్లందిరికీ ఇదే శిక్ష పడాలి… అంటూనే ప్రతి రెపిస్ట్ పట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా? ఇకపై కూడా పోలీసులు ఇలాంటి సంఘటలను జరిగినప్పుడు ఇంతే ధైర్యంతో ముందుకెళ్లాలి అంటూ స్పందించారు గుత్తా. పోలీసులంతా అండర్ లైన్ చేసుకుని నా ఉద్దేశాన్ని అర్దం చేసుకోండి అంటూ పిలుపునిచ్చింది.

ఇక ప్రతీ అత్యాచార ఘటనపై పోలీసులు ఇలానే వ్యవహరించాలి. ఎవరో ఒకరు ఏదో రాజకీయ నాయకుడు పేరు చెప్పి తప్పించుకుంటున్నారు. వాళ్ల సంగతి ఏంటి ? దిశ లానే ఎందరో హత్యాచారంలో ప్రాణాలు పొగోట్టుకున్నారు. దిశ ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి వెంటనే ప్రభుత్వం రియాక్ట్ అయింది. మరి మిగతా బాధితుల సంగతి ఏంటి ? వాళ్లకి కూడా న్యాయం జరగాలి కదా ? ఈ విషయంలో సెలబ్రిటీలు ఎందుకు మాట్లాడరు? ఒకరు మాట్లాడితనే మరొకరు ముందుకు కదులుతారా ? సమాజంపై వాళ్లకి బాధ్యత లేదా ? అంటూ ఓయూకి చెందిన ఓ పీహెచ్ డీ విద్యార్ధి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -