జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరోసారి విరుచుకుపడ్డాడు మూవీ క్రిటిక్ కత్తి మహేష్. ఇంకోసారి రాయలసీమ వాసుల్ని కించపరుస్తూ మాట్లాడితే ఊరుకోకునేది లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను బూతులు తిట్టాలేదని.. ఆయన రాజకీయంగా బ్రోకర్ అని.. సామాజికంగా జోకర్ అని ఇది కేవలం విమర్శ మాత్రమే అని బూతు కాదని కత్తి మహేష్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ను ఓరేయ్ అని అనడం లో నాకు ఎలాంటి తప్పు కనిపించలేదని కత్తి చెప్పారు. అతను రాయలసీమ గురించి తప్పుగా మాట్లాడినప్పుడే నేను అతనిపై ఘాటు వ్యాఖ్యలు చేశాను. నిజానికి తెలుగుదేశానికి పవన్ కళ్యాను బానిస కుక్క.. కాదని నిరూపించమనండి అని కత్తి అన్నారు. రాయలసీమకు చెందిన వాడిని నేను కూడా. రాయలసీయమకు చాలా అన్యాయం జరిగింది.
వీటి గురించి మాట్లాడకుండా.. జగన్ రాయలసీమ వాసి కాబట్టి.. కర్నూల్ లో కోర్టు పెట్టుకోమనండి.. ఇడుపుల పాయలో రాజధాని పెట్టుకోమనండి అంటూ సీమవాసుల్ని అవమానించేలా పవన్ మాట్లాడటం బాధను కలిగించింది. ఎప్పుడైతే నా మీద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోడిగుడ్లు దాడి చేశారో.. వాళ్లను ఆయన ఆఫీస్కు పిలిపించుకుని అభినందించి వాళ్లతో కలిసి ఫోటోలు దిగినప్పుడే నేను పర్శనల్గా తీసుకోలేదు. దాన్ని నేను అతని మూర్ఖత్వం గానూ.. దిగజారుడుతనానికి నిదర్శనంగానూ తీసుకున్నాను.
ఒక వ్యక్తిగా అతను గౌరవించదగిన వాడు కాదని అనుకున్నా. అంతేతప్ప కక్ష సాధింపు కాదు. మరోమారు రాయలసీమ విషయంలో తప్పుడు మాటలు మాట్లాడితే.. గుండు గీయడమే కాదు.. నేను అతని ఇంటిలోకి దూరి మరీ కొడతానేమో అని పవన్ పై కత్తి మహేష్ మండిపడ్డాడు.