Friday, March 29, 2024
- Advertisement -

మీడియాకు చుర‌కలు అంటించిన మ‌హేశ్ బాబు

- Advertisement -

మ‌హేశ్‌బాబు మీడియాతో ఎప్పుడు మాట్లాడాడని అనుకుంటున్నారా..? ఇది నిజ జీవితంలో కాదులేండి. సూప‌ర్‌స్టార్ మహేశ్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హర్షి సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర‌వేగంగా జ‌రుపుకుంటుంది. తాజాగా ఈ సినిమాలోని కొన్ని కీల‌క సన్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఈ సీన్స్‌లో మ‌హేశ్ మీడియాతో మాట్లాడుతు , వారిపై ఫైర్ అవుతార‌ని తెలుస్తోంది. మీడియా సెలబ్రెటీలను,వారి జీవితాలను హైలెట్ చేయటంలో బిజిగా ఉందని, పంట పండించి అందరి మనందరికి ఆహారం అందించే రైతును, అతని జీవితాన్ని పట్టించుకోదని సున్నితంగా చురకలు వేస్తాడట మ‌హేశ్‌.

ఈ సీన్ సినిమాకే హైలేట్‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్నారు చిత్ర యూనిట్‌. గ‌తంలో భ‌ర‌త్ అనే నేను సినిమాలో కూడా ప్రెస్ మీట్ సీన్ హైలేట్ అయింది. దీంతో మ‌రోసారి ప్రెస్‌మీట్ సీన్‌లో మ‌హేశ్ రెచ్చిపోయాడ‌ని స‌మాచారం. సినిమా చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటుంది. మ‌హేశ్ స‌ర‌స‌న పూజా హెగ్డె హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ సినిమా మ‌హేశ్ కెరీర్‌లో 25వ సినిమా కావ‌డంతో చాలా ప్ర‌తీష్టాత్మ‌కంగా మ‌హ‌ర్షి సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. దిల్‌రాజు, అశ్వనీదత్, పివిపి కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏప్రిల్ 25న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తున్నారు. మ‌హేశ్ ఈ సినిమాలో రెండు డిఫరెంట్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తాడని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -