Thursday, April 25, 2024
- Advertisement -

మోడీని కలుస్తున్న చిరు.. ఎందుకో తెలుసా ?

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం సైరా నరసింహా రెడ్డి. తమన్నా, నయనతార హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని సురేందర్ రెడ్డి తెరకెక్కించగా రామ్ చరణ్ నిర్మించారు. అయితే ఇటివలే ఈ సినిమా సక్సెస్ మీట్ లు కూడా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై కూడా ఈ చిత్రం ను చూసి చిరంజీవిని ప్రశంసించారు.

అంతేకాకుండా రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి దంపతులు కలిశారు. సినిమాని చూడాల్సిందిగా జగన్ ను చిరు కోరారు. ఇక ఇక తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను మెగాస్టార్ చిరంజీవి కలవనున్నారట. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ తో కలిసి వెళ్లిన చిరంజీవి.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

తొలుత ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ’సైరా’ సినిమాని చూడాల్సిందిగా కోరనున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవనున్నారు. అయితే ఇది రాజకీయంగా కూడా కొందరు చూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -