Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీ అసెంబ్లీ లాబీల్లో లోకేష్-ఆర్కే మధ్య ఆసక్తికర సన్నివేశం..

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఐదవ రోజు వాడీవేడిగా సాగుతోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో అసెంబ్లీ స‌మావేశాల్లో అరుదైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేసిన మాజీ మంత్రి నారా లోకేష్-ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలిసారి ఎదురుపడ్డారు. ఒకరినకొరు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నారు.

ఈ సండ‌ర్భంగా ఆర్కేకు లోకేష్ కరచాలనం చేసి.. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్కే కూడా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నుంచి నారా లోకేష్.. వైసీపీ నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేశారు. లోకేష్‌పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలిచిన సంగ‌తి తెల‌సిందే.

గత ఎన్నికల్లో పోటీ పడ్డ ప్రత్యర్థులిద్దరూ ఒకరినొకరు పలకరించుకోవడం ఇదే మొదటిసారి. మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి వీరిద్దరూ పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో లోకేశ్ పై 5,200 ఓట్ల తేడాతో ఆర్కే గెలుపొందారు. ఎమ్మెల్సీగా ఉన్న లోకేశ్ అదే పదవిలో కొనసాగుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -