వైఎస్ జగన్ పై టీడీపీ మాజా మంత్రి నారా లోకేష్ విమర్శలు ఎక్కు పెట్టారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. బాబు హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు జగన్ కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈకమిటీపై నారా లోకేశ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తన తండ్రి చంద్రబాబుపై 26 కమిటీలను వేశారని, వాటిల్లో ఒక్క కమిటీ కూడా ఇసుమంత అవినీతిని చూపించలేదని, ప్రతి కమిటీ క్లీన్ చిట్ ఇచ్చిందని మాజీ మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కమిటీలు వేసి ఏం చేస్తారని ప్రశ్నించారు. వంశధారపై మీరు వేసిన కమిటీ రూపాయి అవినీతి జరగలేదని నివేదికిచ్చింది.’’ అని లోకేష్ పేర్కొన్నారు.
జగన్ అక్రమాస్తుల కేసులపై కూడా స్పందించారు. అక్రమాస్తుల కేసుల్లో మీపై లెక్కకు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండటం ఏమీ బాగోలేదు సార్!’’ అంటూ సెటైర్లు వేశారు. అనంతరం పోలవరం ప్రాజెక్టుపైనా కూడా సెటైర్లు వేశారు. పోలవరంపై టీడీపీ హయాంలో పంపిన అంచనాలన్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల…కల గానే మిగిలిపోతుంది’’ అని పేర్కొన్నారు.