అమరావతిలో చంద్రబాబుకు మరో బిగ్ షాక్ తగలనుందనె వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అపరేషన్ కమలం దెబ్బకు కుదేలవుతున్న పార్టీని మరో దెబ్బ కొట్టేందుకు సిద్దమయ్యింది. టీడీపీకి చెందిన ముఖ్యనేతలను తమ పార్టీలోకి ఆకర్షిస్తున్న బీజేపీ పెద్దలు మరో బిగ్ వికెట్పై గురి పెట్టారు. రెండో సారి కేంద్రంలో అధికారంలోకి రావడంతో తెలుగు రాష్ట్రాల్లో తన బలం పెంచుకొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానె టీడీపీకీ చెందిన అసంతృప్తి నేతలను, సీనియర్ నేతలను తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
తాజాగా టీడీపీలో సీనియర్ నేత అయిన రాయపాటి సాంబశివరావును పార్టీలోకి చేర్చుకొకేందుకు సిద్దం అయ్యింది భాజాపా. టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే క్రమంలో…ఆ వర్గానికి చెందిన రాయపాటి సాంబశివరావు వంటి వారిక గాలం వేస్తోంది.
దీనిలో భాగంగా రాయపాటితో చర్చల కోసం స్వయంగా బీజేపీ ముఖ్యనేత రామ్మాధవ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. గుంటూరులోని రాయపాటి నివాసానికి రెండు రోజుల క్రితం వచ్చిన రామ్ మాధవ్… తమ పార్టీలో చేరాల్సిందిగా రాయపాటిని ఆహ్వానించినట్లు సమాచారం. రెండు రోజుల్లో ఢిల్లీ వచ్చి పార్టీ పెద్దలను కలుస్తానని రాయపాటి చెప్పినట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలని భావిస్తున్న బీజేపీ… పెద్ద ఎత్తున అనుచరగణం ఉన్న నాయకులను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. అయితే రాంమాధవ్తో చర్చలు జరిపిన వెంటనె చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తనకున్న ఇబ్బందులను చంద్రబాబుకి వివరించినట్లు సమాచారం. ఢిల్లీలో తాను నివాసం ఉంటున్న ఇంటి వ్యవహారంతోపాటు.. పలు సమస్యలను విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి గుంటూరు టీడీపీలో కీలకమైన నేతగా ఉన్న రాయపాటి సాంబశివరావు కూడా సైకిల్ దిగుతారా అనే చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.