టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మళ్లీ వార్తల్లో నిలిచారు.తరుచు వివాదాలతో సావాసం చేసే ఆయన మరోమారు రెచ్చిపోయారు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్తూన్న కారుని మంగళగిరి మండలం కాజా టోల్ గేట్ సిబ్బంది ఆపారు.అంతే వారిపై ఓ రేంజ్లో రెచ్చిపోయారు చింతమనేని.. కారుకు నెంబర్ ప్లేట్, ఎమ్మెల్యే పాస్ లేకుండా టోల్గేట్ నుంచి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. దీంతో టోల్గేట్ సిబ్బంది చింతమనేని కారును అడ్డుకున్నారు. కనీసం ఎమ్మెల్యే స్టికర్ కూడా లేకపోవడంతో వారు వాహనాన్ని నిలిపివేశారు.
దీంతో చింతమనేని తనకు అలవాటైన రితీలో టోల్గేట్ సిబ్బందిని దూషించారు. ఈ విషయంలో టోల్ గేట్ సిబ్బంది కూడా తగ్గకపోవడం,అక్కడకు మీడియా రావడంతో చింతమనేని అక్కడ నుంచి మెల్లగా వెళ్లిపోయారు.తన కారుని అక్కడే వదిలేసి .కుటుంబ సభ్యులతో కలిసి బస్సులో వెళ్లారు. చింతమనేని వ్యవహరంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నంబర్ ప్లేట్ లేకుండా, కారు పాస్ లేకుండా కేవలం ప్రభుత్వ వాహనం అని మాత్రమే రాసి ఉండంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
మళ్లీ రెచ్చిపోయిన చింతమనేని ..కారు వదిలి పరార్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -