ఆలూ లేదు సూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది వైసీపీ నేతల పరిస్థితి. ఇంకా ఫలితాలు రాకముందె మంత్రి పదవులకోసం నానా తంటా పడుతున్నారు. గెలుపు ఎవరదినే దానిపై రాజకీయవర్గాల్లో ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాన రాజకీయ పార్టీలు… కచ్చితంగా గెలుపు తమదే అని నమ్మకంగా ఉన్నాయి. జగన్ ఒకడుగు ముందుకేసి అధికారంలోకి వైసీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదలా ఉంటె జగన్ దగ్గర చనువు ఉన్న కొందరు మాత్రం మంత్రి పదవులకోసం ఇప్పటి నుంచె తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పలానా వారికి మంత్రి పదవులు వస్తాయంటూ సమాజిక మాధ్యమాల్లో లీకిలిచ్చుకంఉటున్నారు. కొందరయితే అధినేత జగన్ను ప్రసన్నం చేసుకోవడానికి తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
కొత్త ప్రభుత్వంలో తమకు కేబినెట్ బెర్త్ దక్కుతుందా లేదా అనే అంశంపై అప్పుడే కొందరిలో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు వీరే అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాసంగతి తెలిసిందే.
మరో వైపు జగన్ కూడా జిల్లాల వారిగా తన క్యాబినేట్లో ఎవరు ఉండాలనేదినిపై కసరత్తు చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అయితే కొందరు నేతలు మాత్రం జగన్ దగ్గరకు వెల్లి మంత్రి వర్గంలో తమక చోటు ఇవ్వాలని విన్నవించుకున్న నేతలకు మాత్రం జగన్ క్లాస్ పీకినట్లు సమాచారం. ఎవరిని కేబినెట్లోకి తీసుకోవాలో తనకు తెలుసని… అన్నీ అంశాలను పరిశీలించిన తరువాతే దీనిపై నిర్ణయం తీసుకుంటానని వైసీపీ అధినేత వారికి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం.