బిగ్బాస్ హౌస్లో గత రెండు రోజులుగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.షో మొదటి నుండి హౌస్మెట్స్ అందరిలోను గీతా మాధురి తన ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకుంది.మొదటి నుండి ఆమె తన పద్దతితో అందరిని ఆకట్టుకుంది.ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికి తాజాగా గీతా మాధురి ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఆమె గత రెండు రోజులుగా హౌస్మెట్ అయిన సామ్రాట్తో క్లోజ్గా ఉంటుంది.మొన్నటి ఎపిసోడ్ లో గీతా-సామ్రాట్ ల మధ్య చూపుల యుద్ధం జరిగింది. ఈయన నాకు బాగా క్లోజ్ అయిపోతున్నారు అంటూ గీతా మాధురి చెప్పిన మాటలు ఆమె ఫాన్స్కే నచ్చడం లేదు.ఇక నిన్న జరిగిన ఎపిసోడ్లో గీతా అతని షర్ట్కి లిప్ స్టిక్ని పూసింది.
దీంతో వీరి మధ్య ఏదో జరుగుతుందనే రూమర్లు మొదలయ్యాయి.తాజాగా వీరి బంధంపై గీతా మాధురి భర్త నందు స్పందిచారు.గీతా మాధురి,సామ్రాట్లు ఇద్దరు ఒకరికి ఒకరు అంతకముందే తెలుసునని,వారు మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని చెప్పుకొచ్చాడు.ఇక తన భార్య గీతా మాధురి గురించి చెబుతు …గీతా మీద నాకు పూర్తి నమ్మకం ఉందని,ఆమె ఎప్పటికి తప్పు చేయదని తెలిపాడు.ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటుందో సామ్రాట్తో కూడా అలానే ఉంటుందని,ఇందులో తప్పు ఏం ఉందని మీడియాను ప్రశ్నించాడు.దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు రాసి మాలాంటి వారిని బాధ పెట్టవద్దని వేడుకున్నాడు నందు.