Tuesday, April 23, 2024
- Advertisement -

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

- Advertisement -

తమిళ సినీ పరిశ్రమలో నటి కస్తూరి పేరు ఈ మధ్య బాగా వినిపిస్తోంది. అన్నమయ్య సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కస్తూరి నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఆమె చేస్తున్న కామెంట్స్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇక రీసెంట్ బిగ్ బాస్ షో పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తెలుగులో బిగ్ బాస్ షో మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది.

ఇక తమిళ్ లో మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ నాలుగవ సీజన్ మొదలు కాబోతుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేశారు. ఇక ఇలాంటి సమయంలో కస్తూరి శంకర్ బిగ్ బాస్ నిర్వకాహాకులు మోసం చేసినట్లు చెబుతోంది. గత ఏడాది తమిళ బిగ్ బాస్ మూడవ సీజన్ లో వైల్డ్ కార్డ్ ద్వారా కస్తూరి ఎంట్రీ ఇచ్చి.. గోడవలతో షోకి మంచి హైప్ తెచ్చింది. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయింది.

అయితే షోకి వెళ్లేముందు పేమెంట్ మాట్లాడుకున్నప్పటికి ఇంతవరకు డబ్బులు చెల్లించలేదని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చింది. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బును అనాధ పిల్లల కోసం ఉపయోగించాలని అనుకుంటే ఏడాది గడిచినా ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అలానే బిగ్ బాస్ షోను కొనసాగిస్తున్న విజయ్ టీవీకి కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియడం లేదని సెటైర్ వేసింది. అయితే చివరికి తనకు మోసమే జరిగిందని చెప్పింది. కస్తూరి కామెంట్స్ కి భారీ స్థాయిలో నెటిజన్స్ నుండి మద్దతు లభిస్తోంది. ఇటీవల లక్ష్మీ మీనన్ కూడా బిగ్ బాస్ షో ఒక చెత్త షో అంటూ ఘాటుగా కామెంట్స్ చేసింది.

పవన్ ఫ్యాన్స్ జోలికి వెళ్లిన దేవి నాగవల్లి.. ఏమైంది ?

బెడ్ రూమ్ సీన్స్ చేసి తప్పు చేశాను : ఆండ్రియా

ఒక్క చాన్స్ అంటున్నా రాజశేఖర్…

బండ్ల గణేష్ తో పవన్ కళ్యాణ్ నిజమేనా…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -